మార్కెఫెడ్ రాష్ట్ర సభ్యుడిని అభినందించిన ఎమ్మెల్యే దేవ

57చూసినవారు
ఆంధ్రప్రదేశ్ మార్కెఫెడ్ రాష్ట్ర సభ్యుడిగా రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు గుండుబోగుల నరసింహారావు (పెదకాపు)ను నియమించడం హర్షనీయమని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తెలిపారు. మామిడికుదురు మండలం ఈదరాడలో మంగళవారం జరిగిన సభలో ఆయన్ను ఎమ్మెల్యే అభినందించారు. పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో ఘనంగా సత్కరించారు. కష్టపడే కార్యకర్తలకు జనసేన గుర్తింపు ఇస్తుందనేందుకు పెదకాపు నియామకమే నిదర్శనమని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్