రోడ్డుకు మరమ్మతులు

77చూసినవారు
రాజోలు మండలంలోని రాజోలు మట్టపర్తి కాలువగట్టు రోడ్డు ఇటీవల కురిసే వర్షాలకు అధ్వానంగా మారింది. ఆ మార్గంలో ప్రయాణించే ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీనిపై స్పందించిన గ్రామ సర్పంచ్ రేవు జ్యోతి రహదారికి సోమవారం తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. జేసీబీ సహాయంతో గుంతలు పూడ్చి కంకర వేసి రోలింగ్ చేయించారు.

సంబంధిత పోస్ట్