తుని జీఆర్పీ పోలీస్స్టేషన్ పరిధిలో గుల్లిపాడు- నర్సీపట్నం స్టేషన్ల మధ్యలో రైలు నుంచి జారిపడి శ్రీనివాసరావు( 45) మృతి చెందాడని ఎస్సై అబ్దుల్ మారూఫ్ తెలిపారు. విశాఖపట్నం నుంచి రాజమహేంద్రవరం వైపు వెళుతున్న ఏపీ ఎక్స్ప్రెస్ నుంచి జారిపడి శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందాడు. జగ్గయ్యపేటకు చెందిన శ్రీనివాసరావు కుమార్తెను చూసి తిరిగి వెళ్ళతుండగా రైలు నుండి ప్రమాదవశాత్తూ జారిపడి మృతి చెందాడు అన్నారు.