100% పింఛన్లు పంపిణీ ఎంపీడీవో
అల్లవరం మండల పరిధిలోని అన్ని సచివాలయాల్లో 100% పింఛన్లు పంపిణీ చేయాలని, లబ్ధిదారులకు అసౌకర్యం కలగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో కృష్ణమోహన్ శనివారం చెప్పారు. మండల పరిషత్ కార్యాలయంలో శనివారం పంచాయితీ కార్యదర్శులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. మొత్తం 9, 581 మందికి గాను 9, 383 మందికి పింఛన్లు పంపిణీ చేసి 98% పూర్తి చేశారని సచివాలయ ఉద్యోగులను అభినందించారు. మిగిలిన రెండు శాతం కూడా పూర్తి చేయాలన్నారు.