బాల బాలాజీ ఆలయ ఆదాయం వివరాలు
మామిడికుదురు మండలంలోని అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ స్వామివారి దర్శనానికి శనివారం భక్తులు పోటెత్తారు. వేకువజామున నుండి భక్తులు గోదావరి నది లో స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులు నిర్వహించిన వివిధ సేవలు ద్వారా స్వామివారి ఆలయానికి రూ. 1, 99, 558 ఆదాయం లభించిందని ఆలయ ఈఓ మాధవి తెలిపారు.