టీడీపీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కూటమి నేతల నినాదాలు

57చూసినవారు
మామిడికుదురు మండలం మగటపల్లిలో వైసీపీ నేతలకు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తొత్తుగా మారారని ఆ గ్రామానికి చెందిన కూటమి నేతలు బుధవారం ధర్నా నిర్వహించారు. మామిడికుదురు మండల రెవెన్యూ కార్యాలయం వద్ద రాజప్ప రాజీనామా చేయాలంటూ.. వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. 30 ఏళ్ల నుంచి ప్రభుత్వ స్థలంలో ఉపాధి పొందుతున్న టీడీపీ కార్యకర్తకు వ్యతిరేకంగా రాజప్ప పనిచేస్తున్నారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్