వైద్యులచే పరీక్ష - గర్భిణీల సుఖమయ ప్రసవానికి రక్ష
బుధవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంగరలో ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పురస్కరించుకుని వైద్యాధికారి డా. పి. ఎన్. యస్. డి. రత్న కుమారి అధ్వర్యంలో ప్రముఖ గైనాకాలజిస్ట్ డా. కె. కన్యా కుమారి 31మంది గర్భిణీలను పరీక్షించి, 7మందిని క్లిష్టతర గర్భిణీలుగా గుర్తించి, వారికి ప్రత్యేక వైద్య సదుపాయం ఏర్పాటు చేశారు. వచ్చిన వారికి రక్త పరీక్షలను చేసి, మందులను అందజేశారు.