భోజనాల అంచనా తారుమారు
మండపేట నియోజకవర్గంలో ఎన్నికలవేళ ఈవీఎం పరికరాలను తీసుకునేందుకు ఆదివారం వచ్చిన సిబ్బందికి అధికారులు సిద్ధం చేసిన భోజనాలు చాలకపోవడంతో మరొకసారి వండే ప్రయత్నం చేశారు. ఉదయం అల్పాహారం కూడా ఇదే రీతిగా ఉందని ఎన్నికల సిబ్బంది అంటున్నారు. భోజనాలు సరిపోకపోవడంతో కొందరు పోలీస్ సిబ్బంది భోజనాలు చేసేందుకు బయటకు వెళ్లడంతో రూట్ బస్సులు పోలీసులు లేక చాలాసేపు నిలిచిపోయాయి.