గెలిచేది ఎవరు... ఓడేదెవరు.
రేపు జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మండపేట నియోజకవర్గంలో ప్రధాన పోటీ వైకాపా అభ్యర్థి తోట త్రిమూర్తులు, కూటమి అభ్యర్థి వేగుళ్ళ జోగేశ్వరరావుల మధ్య జరగనుంది. సోమవారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరగనున్న ఓటింగ్ ప్రక్రియలో ఓటర్లు ఏ తీర్పు ఇవ్వనున్నారో ఉత్కంఠగా మారింది. ఓటింగ్ ప్రక్రియ రేపు పూర్తయినా జూన్ 4న ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే.