హైకోర్ట్ బార్ అసోసియేషన్ లైబ్రరీ సెక్రటరీగా రమ్యకృష్ణ
ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘానికి అమరావతిలో జరిగిన ఎన్నికలలో రాజమండ్రి నగరానికి చెందిన న్యాయవాది కోదాటి రమ్యకృష్ణ లైబ్రరీ సెక్రటరీగా 787 ఓట్లతో సోమవారం గెలుపొందారు. కాగా రమ్యకృష్ణ రాజమండ్రిలోని జీఎస్కేఎమ్ న్యాయ కళాశాలలో 2011లో ఎల్ఎల్బి పూర్తి చేశారు. ఈ మేరకు స్థానిక న్యాయవాదులు, ప్రముఖులు అభినందించారు.