అంతర్వేదిలో గోశాలకు ఎండు గడ్డి వితరణ
సఖినేటిపల్లి మండలం అంతర్వేది కొలువుదీరిన శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలోని గోశాలకు పశుగ్రాసంగా పెరవలి మండలం నడుపల్లికి చెందిన కోడూరు వెంకట శివ నారాయణ, లక్ష్మీ దంపతులు ట్రాక్టర్ ఎండు గడ్డిని అందించారు. దీన్ని ఆలయ ఉద్యోగులకు అందజేశారని అసిస్టెంట్ కమిషనర్ వి. సత్య నారాయణ సోమవారం తెలిపారు. పశుగ్రాసం అందించిన దాతకు ఆలయ ఉద్యోగులు స్వామి వారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.