రెండవ రోజు ఘనంగా పవిత్రోత్సవాలు

60చూసినవారు
సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ సన్నిధిలో రెండవ రోజు శుక్రవారం పవిత్రోత్సవాలను ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు స్వామివారి ఉత్సవ మూర్తుల విగ్రహాలను మండపం వద్దకు తీసుకువచ్చి వేదమంత్రాలు నడుమ పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ రాజా ఆలయ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్