ప్రేమించిన అమ్మాయి దక్కలేదనే మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మనోహరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ కరుణాకర్రెడ్డి వివరాల ప్రకారం.. మండలంలోని కాళ్లకల్ గ్రామానికి చెందిన భ్యాగరి స్వామి చిన్న కుమారుడు ప్రశాంత్ (24) ఓ అమ్మాయిని ప్రేమించాడు. కాగా అమ్మాయికి వివాహం కావడంతో తాగుడుకు బానిసయ్యాడు. శుక్రవారం ప్రశాంత్ జీవితంపై విరక్తితో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.