​​​​​​​ప్రేమించిన అమ్మాయి దక్కలేదని.. మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య

585చూసినవారు
​​​​​​​ప్రేమించిన అమ్మాయి దక్కలేదని.. మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య
ప్రేమించిన అమ్మాయి దక్కలేదనే మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మనోహరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ కరుణాకర్‌రెడ్డి వివరాల ప్రకారం.. మండలంలోని కాళ్లకల్‌ గ్రామానికి చెందిన భ్యాగరి స్వామి చిన్న కుమారుడు ప్రశాంత్‌ (24) ఓ అమ్మాయిని ప్రేమించాడు. కాగా అమ్మాయికి వివాహం కావడంతో తాగుడుకు బానిసయ్యాడు. శుక్రవారం ప్రశాంత్‌ జీవితంపై విరక్తితో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్