మేం పొమ్మన్న నేతలే టీడీపీకి దిక్కయ్యారని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. ఆదివారం అంబటి మాట్లాడుతూ.. లావు కృష్ణదేవరాయులు, జంగా కృష్ణమూర్తి వైసీపీని వీడి సైకిల్ ఎక్కారని గుర్తు చేసుకున్నారు. టీడీపీకి అభ్యర్థులు దొరకట్లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, పవన్లపై తాను విమర్శలు చేశానే తప్ప ఏనాడు వారిని తిట్టలేదని చెప్పారు. చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారని అంబటి మండిపడ్డారు.