రానున్న 75 రోజుల్లో ఎన్నికల యుద్ధం జరగబోతోందని సీఎం జగన్ అన్నారు. శనివారం సంగివలస సభలో ఆయన మాట్లాడుతూ.. "ఈ యుద్ధం అబద్ధానికి, నిజానికి మధ్య జరుగుతోంది. ఈ యుద్ధం మోసానికి, నిజాయితీకి మధ్య జరుగుతుంది. చంద్రబాబు ఇచ్చిన 650 హామీల్లో కనీసం 10 శాతం కూడా నెరవేర్చలేదు. చంద్రబాబు ఏమి చేశాడో చెప్పడానికి ఏమీ కనిపించదు.. చేసింది ఏమీ లేదు కాబట్టి ఆ పెద్ద మనిషి ఏమీ చెప్పలేడు." అని విమర్శించారు.