వరద బాధితులకు దాతలందిస్తున్న సహకారం అద్వితీయం: ఎమ్మెల్యే

75చూసినవారు
వరద బాధితులకు దాతలందిస్తున్న సహకారం అద్వితీయం: ఎమ్మెల్యే
వరద బాధితులకు దాతలందిస్తున్న సహకారం అద్వితీయమని, ప్రతి ఒక్కరూ మానవత్వంతో ముందుకు వస్తున్నారని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. వరద బాధితులకు సహాయార్ధం పట్టణంలోని 12వ వార్డు అక్షర ఎస్ఎల్ఎఫ్ డ్వాక్రా సిఅర్పిలు రూ.20 వేలు సహాయాన్ని ఎమ్మెల్యే కు గురువారం అందించారు. దాతలను ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో సీఆర్పి ఏ దుర్గవతి, ఎస్. ఆదిలక్ష్మి, పి. పద్మ, టి. విమల, కె. గాయత్రి, సంఘ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్