బొబ్బిలి: గ్రామాల అభివృద్దే కూటమి ప్రభుత్వ లక్ష్యం

54చూసినవారు
భవిష్యత్తులో రోడ్డు సమస్య అనేదే లేకుండా కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలకు పల్లె పండుగ వచ్చిందని బొబ్బిలి నియోజకవర్గం ఎమ్మెల్యే బేబీ నాయన అన్నారు. గత వైసీపీ పాలనలో ప్రతీ గ్రామంలో రోడ్ల దుస్ధితి ఎలా ఉందో అందరికీ తెలుసని విమర్శించారు. బాడంగి మండలంలోని గజరాయునివలస గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

సంబంధిత పోస్ట్