ప్రజలను రోడ్లపైకి అనుమతించకండి

72చూసినవారు
సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు ప్రజలను రోడ్లపై అనుమతించకుండా బారికేడ్లను సిద్దం చేయండని అధికారులకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆదేశాలు జారీ చేశారు. గురువారం కొల్లేటి లంక గ్రామాల పర్యటించిన ఆయన మాట్లాడారు. కొల్లేరులో వర్షపాతం ఎక్కువగా లేకపోయినా ఇన్ ఫ్లో డ్రెయిన్లు నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో కొల్లేరుకి వరద ముంపు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్