ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో జైన్లకు రాజకీయ ప్రాధాన్యత కల్పించే బాధ్యతను తాను స్వీకరిస్తానని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి, జనసేన, బీజేపి కూటమి ఉమ్మడి అభ్యర్ధి బడేటి చంటి హామీ ఇచ్చారు. ఏలూరు శనగపప్పు బజార్ సమీపంలోని జైన్ కమ్యూనిటీ హాల్లో మంగళవారం నిర్వహించిన జైన్ల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న రోజుల్లో జైన్ సంక్షేమానికి తాను అన్నివిధాలా తాను అండగా ఉంటానని భరోసానిచ్చారు.