దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు పందిరి రాట ముహూర్తం

58చూసినవారు
దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు పందిరి రాట ముహూర్తం
నియోజకవర్గ కేంద్రమైన కైకలూరు గ్రామంలో వెంచేసియున్న శ్రీ శ్యామలాంబ అమ్మవారి దేవస్థానంలో క్రోధి నామ సంవత్సర దసరా శరన్నవరాత్రి మహోత్సవములను పురస్కరించుకొని పందిరి రాట ముహూర్తం సోమవారం నిర్వహించారు. ఆలయ చైర్మన్ నంబూరి ప్రతాప్ రాజు దంపతులచే పూజా కార్యక్రమం నిర్వహించి రాట ముహూర్తం జరిపించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అడవి వెంకట కృష్ణ మోహన్, మంద సత్యనారాయణ ప్రసాద్, వేంపాటి విష్ణులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్