త్రిబుల్ ఐటీలలో విద్యార్థులకు అనువైన వసతులు

63చూసినవారు
రాష్ట్రంలోని త్రిబుల్ ఐటీలలో విద్యార్థులకు చదువుకునేందుకు అనువైన వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వెనుకబడిన తరగతుల శాఖ కార్యదర్శి, రాష్ట్ర కళాశాల విద్యా శాఖ కమీషనర్ డా. పోలా భాస్కర్ చెప్పారు. నూజివీడు త్రిబుల్ ఐటీలో శుక్రవారం అధికారులతో సమీక్షించి, విద్యార్థుల మెస్, కిచెన్ లను పరిశీలించిన అనంతరం పాత్రికేయులతో మాట్లాడారు.

సంబంధిత పోస్ట్