రేపు ముసునూరు మండలానికి మంత్రి రాక

70చూసినవారు
రేపు ముసునూరు మండలానికి మంత్రి రాక
ముసునూరులో మంగళవారం రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పర్యటించనున్నారని ముసునూరు ఎం డి ఓ జి. రాణి తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ, మండల పరిధిలోని అక్కిరెడ్డిగూడెం గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేయనున్నట్లుగా తెలిపారు. సూరేపల్లి గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారన్నారు. లోపూడి, చెక్కపల్లిల్లో కూడా సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారన్నారు.

సంబంధిత పోస్ట్