అభివృద్దే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంది: పెద్దిరాజు

78చూసినవారు
యలమంచిలి మండలం కె. ఎస్ పాలెం గ్రామంలో సచివాలయ సిబ్బంది టిడిపి నాయకులు కలిసి పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నూరు శాతం పూర్తి చేసినట్లు మండల టిడిపి అధ్యక్షులు మామిడి శెట్టి పెద్దిరాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం ఉదయం 5: 30 నుండి పెన్షన్ పంపిణీ ప్రారంభించామన్నారు. ఎన్. డి. ఏ ప్రభుత్వం ప్రజల అభివృద్దే లక్ష్యంగా ముందుకు వెళుతుందన్నారు. ఈ అవకాశాన్ని కల్పించిన మంత్రి నిమ్మలకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్