మంత్రి నిమ్మలకు కుప్పంలో ప్రజల నుండి అపూర్వ ఆదరణ

64చూసినవారు
ప్రాజెక్టుల పరిశీలనకు కుప్పం వెళ్లిన పాలకొల్లు ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామా నాయుడు కు అడుగడుగునా ఘన స్వాగతం లభిస్తోంది. మహిళలు హారతులు ఇచ్చి నుదుట కుంకమ దిద్ది మంత్రికి ఆహ్వానం పలుకుతున్నారు. పూలమాలలు వేసి అభిమానాన్ని చాటుకుంటున్నారు. తనపై ప్రజలు చూపిస్తున్న ఆదరణ మరువలేనిదంటూ మంత్రి నిమ్మల మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలకు సేవ చేసి రుణం తీర్చుకుంటానని అన్నారు.

సంబంధిత పోస్ట్