వాగులో పశువుల కోసం నీటి గుంటలు ఏర్పాటు

58చూసినవారు
కుకునూరు మండలం, కుకునూరు పంచాయతీ నల్లకుంట గ్రామంలో వున్న గుండేటి వాగులో గురువారం పశువుల దాహార్తి తీర్చడం కోసం తెలుగుదేశంపార్టీ కుక్కునూరు మండల అధ్యక్షుడు ములిశెట్టి నాగు నీటి గుంటలు తవ్వించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వేసవిలో పశువులకు త్రాగు నీరు లేకపోవడంతో పాడి రైతులు ఇబ్బందులు పడుతున్నారని దీంతో వాగులో జెసిబి సాయంతో నీటి గుంటలు తవ్వించడం జరిగిందని అన్నారు.

సంబంధిత పోస్ట్