కాళ్ళ పారాణి ఆరకముందే నవ వధువు మృతి

75చూసినవారు
కాళ్ళ పారాణి ఆరకముందే నవ వధువు మృతి
కాళ్ళ పారాణి ఆరకముందే నవ వధువు మృతి చెందిన ఘటన కరీంనగర్ లో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా నర్మెట్ట మండలం వెల్దండ గ్రామానికి చెందిన స్వాతికి ఆదివారం వివాహం జరిగింది. సోమవారం వేములవాడకు వెళ్తున్న క్రమంలో కరీంనగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తలకి బలమైన గాయం కావడంతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్