తాడేపల్లిగూడెం: విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద నిరసన

75చూసినవారు
తాడేపల్లిగూడెం: విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద నిరసన
విద్యుత్ సంస్కరణల్లో భాగంగా ట్రూ అప్, సర్దుబాటు ఛార్జీల పేరుతో భారాలు మోపడం వల్ల గత వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపారని సీపీఎం పట్టణ కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు గుర్తు చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనకు నిరసనగా శనివారం తాడేపల్లిగూడెం పట్టణం పాత జయలక్ష్మి థియేటర్ వద్ద గల విద్యుత్ సబ్ స్టేషన్ ముందు ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పట్టణ నాయకుడు కరెడ్ల రామకృష్ణ, సీఐటీయు నాయకుడు రంగారావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్