నారాయణపురంలో గాంధీ జయంతి వేడుకలు

69చూసినవారు
నారాయణపురంలో గాంధీ జయంతి వేడుకలు
జాతిపిత మోహన్ దాస్ కరంచంద్ గాంధీజీ జయంతి సందర్భంగా ఉంగుటూరు మండలం ఆస్తా నారాయణపురం కాలువ గట్టున గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. జనసేన పార్టీ నారాయణపురం గ్రామ కమిటీ కార్యదర్శి బొమ్మిడి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక వ్యాపారస్తులు పుష్పాలతో నివాళులర్పించారు. గాంధీజీ దేశానికి చేసిన సేవలు గురించి అనిల్ కుమార్ ప్రసంగించారు.

సంబంధిత పోస్ట్