ఇద్దరు చిన్నారులకు విషం ఇచ్చి చంపిన తల్లిదండ్రులు (వీడియో)

5532చూసినవారు
తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర విషాద ఘటన జరిగింది. గార్ల మండలం మద్దివంచ అంకన్నగూడెం గ్రామంలో ఇద్దరు కూతుళ్లకు విషం ఇచ్చి చంపేశారో దంపతులు. గ్రామానికి చెందిన కందగట్ల అనిల్, దేవిలు తమ కూతుళ్లు లాస్య(2 ఏళ్లు), లోహిత 2 నెలల పాపను కడతేర్చారు. భార్యాభర్తల మధ్య గొడవలే ఈ దారుణానికి కారణమని తెలుస్తోంది. కాగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దంపతులిద్దరూ పరారీలో ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్