AP: సీఎం చంద్రబాబు సూచనల మేరకు రాజధాని రైతులతో సమావేశమయినట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. మూడు రాజధానుల ప్రకటనతో రైతుల వెంట ఉండాలని నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు. విజయవాడ, రాజమండ్రి పాదయాత్రల్లో తాను పాల్గొన్నానని గుర్తుచేశారు. రైతు బిడ్డగా రాజధాని రైతులకు అండగా నిలిచానని అన్నారు. ఈనెల 15న జరిగే శ్రీనివాసుని కల్యాణంలో రైతులంగా పాల్గొనాలని ఛైర్మన్ పిలుపునిచ్చారు.