బ్రహ్మానందం ఆయన కుమారుడు గౌతమ్ కాంబోలో తెరకెక్కిన మూవీ ‘బ్రహ్మా ఆనందం’. ఈ మూవీలో బ్రహ్మానందం, గౌతమ్ తాతా మనవళ్లుగా కనిపించగా వెన్నెల కిషోర్ కీలక పాత్రలో నటించారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి రానుంది. ఓటీటీ ప్లాట్ఫామ్ ‘ఆహా’లో మార్చి 14 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు మూవీ టీం పేర్కొంది.