తొలిసారి అసెంబ్లీలోకి మాజీ సీఎం వారసుడు

82చూసినవారు
తొలిసారి అసెంబ్లీలోకి మాజీ సీఎం వారసుడు
కర్నూలు జిల్లా డోన్‌లో టీడీపీ నేత కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి విజయకేతనం ఎగురవేశారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ను ఆయన ఆరు వేల ఓట్ల మెజార్టీతో ఓడించారు. మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయుడు అయిన సూర్యప్రకాష్ గతంలో మూడు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర సహాయమంత్రిగానూ ఆయన పని చేశారు. ఈ సీనియర్ లీడర్ తొలిసారి ఏపీ అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు.

సంబంధిత పోస్ట్