లోక్ సభ ఎన్నికల ఫలితాలపై ప్రియాంక గాంధీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాహుల్ను కొనియాడుతూ ఎక్స్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. బీజేపీ వాళ్ళు నిన్ను ఎంతగానో అమవానించినా, ఏం చేసినా సరే దృఢంగా నిలబడ్డావ్. ప్రేమ, దయతో నిజం కోసం పోరాడావు. ఇది వాళ్లందరికీ ఇప్పుడు అర్థం అవుతుంది. నువ్వు మాలో అందరికంటే ధైర్యవంతుడివని మాకు తెలుసు. నీకు సోదరిగా ఉన్నందుకు గర్వపడుతున్నాను’ అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు.