ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఈ క్రమంలోనే బుధవారం తిరుపతిలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటి వరకు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు ఈ వర్షాలు ఉపశమనం ఇచ్చాయి.