AP: పోలింగ్ రోజు, తర్వాత 3 జిల్లాల్లో జరిగిన హింసపై ఈసీ ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 13 మంది సభ్యులతో ఏర్పాటైన సిట్కు ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వం వహించనున్నారు. ఎన్నికల అనంతరం జరిగిన ప్రతి హింసాత్మక ఘటనపైనా సిట్ నివేదిక ఇవ్వనుంది. పల్నాడు, మాచర్ల, నరసరావుపేట, తిరుపతి, చంద్రగిరి, తాడిపత్రి ఘటనలపై సిట్ విచారణ జరపనుంది.