ఫేస్ బ్లైండ్నెస్ సమస్యతో బాధపడే వ్యక్తిగా సుహాస్ నటించిన చిత్రం ‘ప్రసన్నవదనం’. పాయల్ రాధాకృష్ణ హీరోయిన్. రాశీసింగ్ కీలకపాత్ర పోషించారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ వద్ద అసిస్టెంట్గా పనిచేసిన అర్జున్ వైకే తెరకెక్కించిన ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. తెలుగు ఓటీటీ ‘ఆహా’లో ఈనెల 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ‘ఆహా గోల్డ్’ సబ్స్క్రిప్షన్ ఉన్నవారికి 24 గంటల ముందే అందుబాటులో ఉండనుంది.