ఏపీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పులివెందుల్లో మూడు రోజులు, ఆ తర్వాత బెంగళూరు ప్యాలెస్లో మరికొన్ని రోజులు గడుపుతూ వచ్చిన మాజీ సీఎం జగన్ మంగళవారం తాడేపల్లికు రానున్నారు. తన రాకను గురించి పార్టీ ముఖ్యనేతలకు, సన్నిహితులకు సమాచారం అందించారు. దీంతో వారు జగన్కు గన్నవరం విమానాశ్రయంలో ఆహ్వానం పలికేందుకు సిద్ధమవుతున్నారు.