మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర విభజనకు కిరణ్ కుమార్ రెడ్డినే కారణమన్నారు. అలాగే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకుంది ఆయనేనని, ఈ ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి చిత్తుగా ఓడిపోతాడని మంత్రి పెద్దిరెడ్డి జోస్యం చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డి నమ్మకద్రోహి అని, అతను సీఎంగా ఉన్నప్పుడు జగన్ మోహన్ రెడ్డిని వేధించేవాడని ఆయన పేర్కొన్నారు.