టీడీపీలో చేరిన కీలక నేతలు

45581చూసినవారు
టీడీపీలో చేరిన కీలక నేతలు
గుంటూరు తూర్పు మాజీ ఎమ్మెల్యే నంబూరు సుభాని, ఆయన తనయుడు మాజీ డిప్యూటీ మేయర్ షేక్ గౌస్‌లు టీడీపీలో చేరారు. గుంటూరు నుంచి నుచరవర్గ్గంతో ర్యాలీగా ఉండవల్లిలోని టీడీపీ కార్యాలయానికి వెళ్లి నారా లోకేష్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సుభాని చేరికతో నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. నంబూరు సుభాని ఆధ్వర్యంలో అధికార వైసీపీ కార్పొరేటర్లు ఖాజామొహిద్దీన్ చిష్టీబాషా, మీరావలి, వేముల జ్యోతి కూడా టీడీపీలో చేరారు.

సంబంధిత పోస్ట్