వైసీపీ సర్కార్పై
కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ హర్షకుమార్ తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "
వైసీపీ ప్రభుత్వం 27 ఎస్సీ పథకాలను తొలగించింది. జగన్కు 100 శాతం ఓట్లు వేసినా ఎస్సీలను మోసగించారు.
వైసీపీ హయాంలో ఎస్సీలకు రక్షణ లేకుండా పోయింది. ఎన్నడూ లేని విధంగా ఎస్సీలపై దాడులు జరుగుతున్నాయి. ఈ నెల 11న వేమగిరిలో దళిత సింహగర్జన సభ ఉంటుంది." అని తెలిపారు.