వైసీపీపై మాజీ ఎంపీ హర్షకుమార్ విమ‌ర్శ‌లు

562చూసినవారు
వైసీపీపై మాజీ ఎంపీ హర్షకుమార్ విమ‌ర్శ‌లు
వైసీపీ స‌ర్కార్‌పై కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ హర్షకుమార్ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. "వైసీపీ ప్రభుత్వం 27 ఎస్సీ పథకాలను తొలగించింది. జగన్‌కు 100 శాతం ఓట్లు వేసినా ఎస్సీలను మోసగించారు. వైసీపీ హయాంలో ఎస్సీలకు రక్షణ లేకుండా పోయింది. ఎన్నడూ లేని విధంగా ఎస్సీలపై దాడులు జరుగుతున్నాయి. ఈ నెల 11న వేమగిరిలో దళిత సింహగర్జన సభ ఉంటుంది." అని తెలిపారు.

సంబంధిత పోస్ట్