బాలిక హత్యాచార ఘటన.. ఇంకా దొరకని మృతదేహం!

78చూసినవారు
బాలిక హత్యాచార ఘటన.. ఇంకా దొరకని మృతదేహం!
కర్నూలు జిల్లాలోని ముచ్చుమర్రిలో హత్యాచారానికి గురైన బాలిక మృతదేహం కోసం 4వ రోజు (శుక్రవారం) కూడా పోలీసులు గాలిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, స్థానిక మత్స్యకారుల సహాయంతో కలిసి వెతుకుతున్నారు. జులై 7న బాలిక కనిపించకుండా పోయింది. ముగ్గురు మైనర్ బాలురులను అదుపులోకి తీసుకొని విచారించగా.. బాలికపై అత్యాచారం, హత్య చేసి ముచ్చుమర్రి ఎత్తిపోతల కాలువలో పడేశామని వారు చెప్పారు. ఈ క్రమంలో పోలీసులు మృతదేహం కోసం గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్