చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్
కాంగ్రెస్ లో చేరుతున్నట్లు వెల్లడించారు.
టీడీపీ అంటే గౌరవం ఉందని.. తన భావ జాలానికి టీడీపీతో కలిసి ప్రయాణించలేకపోయానని అన్నారు. 2019 ఎన్నికల ముందు
టీడీపీ నుంచి బయటకి వచ్చి వైసీపీలో చేరారు. పర్చూరు నుంచి పోటీ చేయాలని
వైసీపీ కోరడంతో తనకి చీరాల అయితేనే కరెక్ట్ అని
వైసీపీ నుంచి బయటకు వచ్చానని అన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో
కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నట్లు పేర్కొన్నారు.