విజయవాడలోని ముంపు ప్రభావిత ప్రాంతాల ప్రజలకు గుంటూరు నగరపాలక సంస్థ తరుఫున అందించే ఆహార పదార్థాలను అత్యంత జాగ్రత్తగా, పరిశుభ్రమైన వాతావరణంలో తయారు చేశామన్నారు. పర్యవేక్షణ అధికారులు శ్రద్ధ చూపాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. మంగళవారం గుంటూరు నుంచి విజయవాడకు పంపుతున్న 1 లక్ష ఆహార, అల్పాహార పదార్థాల ప్యాకెట్స్, వాహనాలను కమిషనర్ పరిశీలించారు.