వరద ప్రభావంతో విజయవాడ పరిధిలోని కేసరపల్లిలో నీట మునిగిన పంట పొలాలను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తో కలిసి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శుక్రవారం పరిశీలించారు. వరదలకు ముంపునకు గురైన ఇళ్లు, పంటలకు సంబంధించిన ఫోటో గ్యాలరీని పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ కు ఉదార సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఎంపీ బాధితులకు ధైర్యం చెప్పారు