నేడు గుంటూరు నగరపాలక సంస్థలో గ్రీవెన్స్ డే

73చూసినవారు
నేడు గుంటూరు నగరపాలక సంస్థలో గ్రీవెన్స్ డే
గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ డే జరుగుతుందని గుంటూరు నగర కమిషనర్ పి. శ్రీనివాసులు ఆదివారం తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణమే పరిష్కారం చూపుతామని కమిషనర్ స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్