విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించిన ట్రాఫిక్ పోలీసులు

81చూసినవారు
గుంటూరులోని పలు విద్యా సంస్థల విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై పోలీసులు శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ డీఎస్పీ రమేష్ మాట్లాడుతూ మైనర్లు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు నడపకూడదన్నారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ట్రాఫిక్ సిఐ, ఎస్ఐలు కళాశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్