గుంటూరు జిల్లాలో ఐదుగురు ఎస్ఐలను బదిలీ చేస్తూ మంగళవారం జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. లాలాపేట ఎస్ఐ ఎం. సు బ్బారావు, నల్లపాడు ఎస్ఐ డి. ప్రవీణ్ ను తాడేపల్లి ట్రాఫిక్ పీఎస్ కు , పాత గుంటూరు పీఎస్ ఎస్ఐ పి. భాగ్యరాజ్ ను తాడేపల్లి పీఎస్ కు, గుంటూరు వీఆర్ ఉన్న ఎస్ఐలు కె. శ్రీనివాసరావును లాలాపేట పీఎస్ కు , పి. వెంకటేశ్వర్లను పాతగుంటూరు పీఎస్ కు బదిలీ చేశారు.