విష జ్వరంతో బాలుడు మృతి

62చూసినవారు
మంగళగిరిలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన విపరాల మేరకు పాతమంగళగిరి వరహాల పేటకి చెందిన లోహిత్ ద్వారకాకృష్ణ (5)కి శనివారం ఒక్కసారిగా జ్వరం వచ్చింది. వెంటనే విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా ఇన్ఫెక్షన్ తో బ్రెయిన్ డెడ్ అయినట్లు చెప్పారని అనంతరం బాలుగు మృతి చెందినట్లు తెలిపారు. పారిశుద్ధ్యం మెరుగ్గా లేకపోవడం వలనే బాలుడు మృతి చెందినట్లు ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్