జనసేన కార్యకర్తకు పార్టీ తరపున ఆర్ధిక సహాయం

63చూసినవారు
ప్రమాదవశాత్తు గాయపడిన జనసేన కార్యకర్తకి రూ. 50వేలు అందజేసినట్లు మంగళగిరి నియోజకవర్గ జనసేన నియోజకవర్గ ఇన్చార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు చెప్పారు. బుధవారం తాడేపల్లి మండలం చిర్రావూరులో బాధితుడు మక్కే గోపి కుటుంబసభ్యులను ఆయన పరామర్శించి 50వేల చెక్కును అందజేశారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేన సభ్యత్వం తీసుకున్నుందుకు గోపికి ఈ సహాయం లభించిందని, కష్టాల్లో కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని అన్నారు.

సంబంధిత పోస్ట్