ప్రతిపాడులో అక్రమ కట్టడాలు కూల్చివేత

58చూసినవారు
గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం కేంద్రంలో చెరువు పోరంబోకు స్థలంలో దశాబ్దాలుగా అక్రమంగా ఇల్లు నిర్మాణం చేపట్టిన ఇళ్లను పంచాయతీ అధికారులు గురువారం తొలగింపు కార్యక్రమం చేపట్టారు. గతంలో నివాసులకు గృహాలు ఖాళీ చేయమని నోటీసులు అందించామని పంచాయతీ అధికారులు మీడియాకు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అక్రమ నిర్మాణాలు తొలగిస్తున్నట్లు వారి పేర్కొన్నారు. పంచాయతీ సిబ్బంది, పోలీసులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్